భాగవతం - ఆరవ స్కంధము
Jump to navigation
Jump to search
షష్ఠమ స్కందము అనగా ఆరవ స్కందము. ఈ స్కందాన్ని, 11, 12, స్కందాలను పోతన గారు రచింపలేదు, వారి శిష్యులైన సింగయగారు రచించారు. పరిశోధన రచనలలో ఎందుకు పోతన గారు ఈ స్కందాలు రచించలేదు అనేదానికి చాలా చాలా పరిశోధనలు చేసారు. ఈ క్రింది రెండు చాలా ముఖ్యమైన్ అబిప్రాయములు.
- పోతన గారు ఈ నాలుగు స్కందములను తన శిష్యులకు వ్రాయమని ఇచ్చారు.
- రాజు తనకు భాగవతమును అంకితము ఇవ్వలేదని నాశనము చేయ పూనితే ఈ నాలుగు స్కందాలు కాలిపొయినాయి.కనుక మరల వ్రాసినారు.
- అంతాబాగానే ఉంది, కానీ పోతనగారు ఈ భాగవతాన్ని రెండు కట్టలుగా కట్టి చక్కగా భద్రపరిచారు. కానీ రెండు కట్టలలోనూ అడుగున ఉన్న రెండు స్కందాలు చెదలు చేత నాశనము అయినాయి. అందుకనే వాటిని వారి శిష్యులు తిరిగి వ్రాసినారు.
ఇహ ఈ ఆరవ స్కందములోని వివరములు
అజామిళోపాఖ్యానము
[మార్చు]అజమిళుడు ఒక బ్రాహ్మణుడు. ఇతను చక్కగానే ఉండేవాడు, కానీ ఒక రోజు అడవిలో ఒక వేశ్య, కిరాతుల పూర్తి శృంగార క్రీడలు చూసి ఒక వేశ్య దగ్గరకు వెళ్ళి భార్యా, తల్లిదండ్రులను నిర్లక్ష్యము చేస్తాడు, కానీ అతనికీ వేశ్యకు పుట్టిన కుమారునికి నారాయణుడు అని పేరు పెట్టుకుంటాడు.
ఇతను మృత్యుముఖంలో కుమారున్ని పిలుస్తు నారాయణా, నారాయణా అని అంటాడు, అప్పుడు అతనిని రక్షించడానికి స్వయంగా విష్ణుదూతలే వచ్చి యమదూతలతో వాదించి అజామిళునికి చక్కని బోధనలు చేస్తారు.
ఇందులోని ఇతర భాగాలు
[మార్చు]- దక్షుని హంసగుహ్యం అను స్తవరాజము
- నారదుడు శబళాశ్వులకు ఉపదేశములు చేయుట
- దక్షుని నారదుని శాపవృత్తాంతము
- దేవాసుర యుద్ధము
- శ్రీమన్నారాయన కవచము
- వృతాసుర వృత్తాంతము
- చిత్రకేతూపాఖ్యానము
- సవితృ వంశ ప్రవచనాది కథ