నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 - 2024
నియోజకవర్గం కోవూరు నియోజవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 12 డిసెంబర్ 1961
కోవూరు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, శ్రీలక్ష్మమ్మ
జీవిత భాగస్వామి నల్లపరెడ్డి గీత
సంతానం నల్లపరెడ్డి రజత్‌ కుమార్‌ రెడ్డి
నివాసం సుజాతమ్మ కాలనీ, దర్గామిట్ట, నెల్లూరు

నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అయన కోవూరు నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి 12 డిసెంబర్ 1961లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లా, దర్గామిట్టలో నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి, శ్రీలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. అయన 1984లో ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం కాలేజ్, హైదరాబాద్‌ నుండి బీఏ పూర్తి చేశాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి 1993లో తన తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మరణాంతరం రాజకీయాల్లోకి వచ్చి 1994లో జరిగిన ఎన్నికల్లో కోవూరు పశ్చిమ నియోజవర్గం నుండి టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై ఎన్టీఆర్‌ మంత్రివర్గంలో చక్కెర కర్మాగారాల శాఖ మంత్రిగా పని చేశాడు. ఆయన 1999లో గెలిచి 2004లో ఓడిపోయాడు. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి 2009లో జరిగిన ఎన్నికల్లో కోవూరు పశ్చిమ నియోజవర్గం నుండి టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.

నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.. వై.యస్. రాజశేఖరరెడ్డి మరణాంతరం 2011లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పై 23,494 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి 2014లో జరిగిన ఎన్నికల్లో కోవూరు పశ్చిమ నియోజవర్గం నుండి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ 2019లో జరిగిన ఎన్నికల్లో తిరిగి ఎమ్మెల్యేగా గెలిచాడు.[3][4]

నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో కోవూరు నుండి వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చేతిలో 54583 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (12 June 2019). "ఆరోసారి అసెంబ్లీకి". Archived from the original on 5 జనవరి 2022. Retrieved 5 January 2022.
  2. Sakshi (18 March 2019). "నెల్లూరు బరిలోని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు వీరే". Archived from the original on 5 జనవరి 2022. Retrieved 5 January 2022.
  3. Sakshi (2019). "వైఎస్సార్సీపీ". Archived from the original on 2 November 2021. Retrieved 8 November 2021.
  4. Sakshi (2019). "MLA Candidates Winners LIST in Andhra Pradesh Elections 2019". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
  5. Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Kovur". Archived from the original on 30 June 2024. Retrieved 30 June 2024.