దస్త్రం:శిరందాసు నాగార్జున రావు.jpg
శిరందాసు_నాగార్జున_రావు.jpg (300 × 400 పిక్సెళ్ళు, ఫైలు పరిమాణం: 92 KB, MIME రకం: image/jpeg)
Summary
[మార్చు]Description |
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన శిరందాసు నాగార్జున రావు సీనియర్ జర్నలిస్ట్. బీఏ, బీఎల్, ఎంజేఎంసీ చేసిన ఆయన 1988 నుంచి జర్నలిజంలో ఉన్నారు. ఉదయం, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, వార్త, ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్, సాక్షి దినపత్రికలలో సబ్ ఎడిటర్ నుంచి న్యూస్ ఎడిటర్ వరకు పని చేశారు. దాదాపు అన్ని తెలుగు దినపత్రికలలోని ఎడిటోరియల్ పేజీలలో 300కుపైగా వ్యాసాలు రాశారు. మొదటి వ్యాసం ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎడిటోరియల్ పేజీలో 1984లో వచ్చింది. అమరావతిలో వెలగపూడిలోని ఏపీ సచివాలయం ఐ అండ్ పీఆర్ డిపార్ట్ మెంట్ పబ్లిసిటీ సెల్ లో 2017 నుంచి 2019 వరకు పీఆర్వోగా పని చేశారు. ప్రజారాజధాని అమరావతి అనే పుస్తకం కూడా రాశారు. ఆ తరువాత 2020 నుంచి 2022 వరకు ఆంధ్రజ్యోతి సెంట్రల్ డెస్క్(హైదరాబాద్)లో చీఫ్ సబ్ ఎడిటర్ గా చేశారు. |
---|---|
Source |
This my photo |
Date |
2021-03-05 |
Author | |
Permission (Reusing this file) |
See below.
|
- Other information
మంగళగిరిలోని వీటీజేఎం డిగ్రీ కాలేజీ (నాగార్జున విశ్వవిద్యాలయం తరువాత ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంగా మార్చారు)లో 1981-1984లొ బీఏ(ఎకనామిక్స్), నాగార్జునా యూనివర్సిటీ కేంపస్ లో 1986-1989లో బీఎల్ పూర్తి చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 1993లో బ్యాచిలర్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్(బీజేఎంసీ), 1995లో మాస్టర్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్(MJMC) పూర్తి చేశారు.
1988లో మంగళగిరికి ఉదయం విలేకరిగా, 1989-1991లో విజయవాడలోని ఆంధ్రభూమిలో సబ్ ఎడిటర్ గా, 1991-1995లో విశాఖపట్నంలోని ఆంధ్రజ్యోతిలో సబ్ ఎడిటర్(విశాఖ సిటీ డెస్క్ ఇన్ చార్జిగా, 1995-2006లో వార్తలో సీనియర్ సబ్ ఎడిటర్, చీఫ్ సబ్ ఎడిటర్( ఒంగోలు, కడప, అనంతపురం ఎడిషన్ల ఇన్ చార్జి)గా పని చేశారు. 2006-2008లో ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూప్ ప్రధాన కార్యాలయం చెన్నైలో ఏపీవీక్లీ.కామ్ లో చీఫ్ కంటెంట్ ఎడిటర్ గా చేశారు. 2008- 2015లో సాక్షి ప్రధాన కార్యాలయం హైదరాబాద్ లో సాక్షి.కామ్ లో చీఫ్ సబ్ ఎడిటర్, న్యూస్ ఎడిటర్ గా, 2015లో సాక్షి దినపత్రిక అమరావతి(మంగళగిరిలో) ఎడిషన్ ఇన్ చార్జిగా పని చేశారు. 2017-2019లో ఆంధ్రప్రదేశ్ పౌర సంబంధాల శాఖలో పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్(పీఆర్ఓ)గా వెలగపూడిలోని సచివాలయం పబ్లిసిటీ సెల్ లో పని చేశారు. 2020-2022లో ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయం హైదరాబాద్ లో సెంట్రల్ డెస్క్ లో చీఫ్ సబ్ ఎడిటర్ గా చేశారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో సభ్యులుగా ఉన్నారు. 2022 డిసెంబర్ 15 నుంచి ఆధాన్ షార్ట్ న్యూస్ యాప్ ఎడిటోరియల్ లో పని చేస్తున్నారు. ఎడిటోరియల్ పేజీ వ్యాసాలు రాయడం కొనసాగిస్తూనే ఉన్నారు. 60 ఏళ్లు దాటిన జర్నలిస్టులకు తెలుగు రాష్ట్రాలలో పెన్షన్ పథకం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
Licensing
[మార్చు]I, the copyright holder of this work, hereby publish it under the following licenses:
You may select the license of your choice.
|
ఫైలు చరితం
తేదీ/సమయం ను నొక్కి ఆ సమయాన ఫైలు ఎలా ఉండేదో చూడవచ్చు.
తేదీ/సమయం | నఖచిత్రం | కొలతలు | వాడుకరి | వ్యాఖ్య | |
---|---|---|---|---|---|
ప్రస్తుత | 18:23, 5 ఏప్రిల్ 2021 | 300 × 400 (92 KB) | Siramdasunagarjuna (చర్చ | రచనలు) | ఫైల్ ఎక్కింపు విజర్డు- స్వంతంగా తయారుచేసిన ఫైల్ |
ఈ దస్త్రాన్ని మీరు తిరగరాయలేరు.
లింకులు
ఈ ఫైలును వాడుతున్న పేజీలు లేవు.